Sample

Showing posts with label మహర్షి. Show all posts
Showing posts with label మహర్షి. Show all posts

Sunday, March 7, 2010

క్రియా యోగ


సంపూర్ణ ఆరోగ్యం కొరకు సనాతన ఋషులు క్రియ (ఋషి క్రియ) లను తమ దైనందిన జీవితంలో ఒక భాగంగా అనుసరిస్తూ సంపూర్ణ ఆరోగ్యంతో శాంతియుతమైన జీవితాన్ని గడిపేవారు. కాలక్రమేనా క్రియా విధానాన్ని ఋషి సంతతి, వారి శిష్యగణం, సాధకుల అభిరుచి మేరకు సులభపరుచుట వలన కలుషితము అయినది. మనం స్వీకరించి, అనుసరించే పధ్ధతి సరిఅయినదిఅయి ఉండాలి. పధ్ధతి విధి విధానాన్ని సమర్దవంతముగా తెలియచేసి ఆపాదించే నిష్ఠాతుల వృత్తి (సాధకుడు) మనకు కావాలి. అరుదైన విశిష్ట వ్యక్తి "ధ్యానం మాస్టారు". వీరు క్రియలను స్వయముగా సాధన గావించి రూపొందించిన కోర్సు "క్రియ యోగ".

ధ్యానం మాష్టారు గారి విషిష్ఠతలు

  • ౪౨ (నలభై రెండు) రోజుల పాటు నిరాటంకమైన ఉపవాసము చేసారు.
  • గత ౨౦ (ఇరువది) సంవత్సరాలుగా అపక్వాహారము మాత్రమే తీసుకుంటున్నారు.
  • గత ౩౪ (ముప్పై నాలుగు) సంవత్సరములుగా క్రియా సాధన చేస్తూ, శరీర అవయవాలపై స్వాధీనతసాధించారు.
  • ప్రతి సంవత్సరము ౧౮ (పద్దెనిమిది) రోజులు మౌనం, ధ్యానం, ఆహరరహితముగా ఉండి, ముప్పేటస్థితిలో ఆత్మశోధన చేసుకుంటూ స్వరూపానందం పొందుతారు.
  • ౮౪ (ఎనభై నాలుగు) ఆసనాలు వేస్తూ అంతర్గతముగా ౧౮ (పద్దెనిమిది) క్రియలు చేస్తూ, షడ్చక్రాలు, స్వాధీనం చేసుకొని రోజుకు ౧౬ (పదహారు) గంటలు ధ్యానంలో మౌనస్థితిలో ఉంటారు.
  • సాధన నేర్చుకునే గ్రూపునకు "దీక్ష" ఇచ్చేముందు" ఉపవాసము ఉండి తద్వారా వచ్చిన విశ్వాతీతశక్తిని ప్రతిసాధకునకు ప్రసరిస్తారు.
  • భార్య, భర్త ఇరువురు నేర్చుకుంటే వారికి తపశ్శక్తి ధారపోస్తారు.
  • క్లాసు చేసిన వారికి ధ్యానం మాస్టారుగారు మనో మౌనంతో ధ్యానస్థితిలో అంతర్గత శ్వాసలో ఉండి వారుస్వయముగా రాగి డాలరు ఉచితముగా ఇస్తారు.